BT Group: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు వేల సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో యూకే టెలికాం దిగ్గజ సంస్థ బీటీ గ్రూప్ చేరింది. ఏకంగా 55,000 మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు 2030 నాటికి వరకు జరుగుతాయని వెల్లడించింది.
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ అంబానీ బ్రిటన్కు చెందిన బీటీ గ్రూప్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ కంపెనీని పెద్ద మొత్తంలో వాటాను కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేయవచ్చని ఓ ప్రముఖ వాణిజ్య పత్రిక తెలియజేసింది. బీటీ గ్రూప్ నెట్ వర్కింగ్ విభాగాన్ని విస్తరించేందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు రిలయన్స్ సంస్థ సిద్దమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండు కంపెనీల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని సమాచారం. Read: LIVE:…