బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కె.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండు వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ వన్ నుండి మొదలైన బైక్ ర్యాలీ 9వ ఫేస్ వరకు కొనసాగింది. ఈ బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి మద్దతుగా నిలుస్తూ అడుగున అడుగున…
పార్లమెంట్ ఎన్నికలు దేశ.. మన కుటుంబాల భవిష్యత్తుకి కీలకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థని ధ్వంసం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. కీలకమైన చట్టాలు.. ప్రతిపక్షాలను తొక్కేసి ఆమోదం పొందేవి అని ఆయన వ్యాఖ్యానించారు. నియంతృత్వ ధోరణి ప్రజలకు తెలియాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. మోడీ స్పీచ్లు చూస్తే.. ఇంత దిగజారి పోయారు అనిపిస్తుందని, స్టేట్స్ మెన్ లాగా ఉండాలి కానీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ…
రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని మోసం చేశారని, ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా రేవంత్ రెడ్డి డేట్లు మారుస్తున్నాడని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో 10 ,12 సీట్లు మాకు ఇవ్వండని కోరారు. ఆరు నెలల్లో తెలంగాణ లో మళ్ళీ కేసీఆర్.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నమో అంటే నమ్మించి మోసం చేసే టోడు అని ఆయన అభివర్ణించారు. 2…
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్లో ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నేతలతో కలసి ఆయన మాణికేశ్వరి నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Uttam Kumar Reddy: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని,
Amit Shah: ఈ ఎన్నికలు జిహాద్ కు, అభివృద్ధికి మధ్య జరుగుతోందని భువనగిరి జన సభలో అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. జై శ్రీరామ్ నినాదంతో అమిత్ షా ప్రసంగం ప్రారంభించారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునేందుకు తనదైన రీతిలో ప్రచారం చేపట్టారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు మామూలుగా హామీలు ఇవ్వడం, ప్రలోభాలకు గురిచేయడం కామన్.
బీజేపీనీ గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు… మేము వారి దగ్గర వెళ్తే అదే మాట చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ ల ద్వారా లబ్ధి పొందుతున్న వారే బీజేపీ కి ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం నమ్మడం లేదు… నవ్వుకుంటున్నారని, ఎవరు కూడా ఆందోళన లు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. సీఎం బాధ్యతారాహితమైన కామెంట్… శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా మాట్లాడారని, మోడీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు…
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్ అప్రజాస్వామికమని, ఆయనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ హాస్టళ్లకు వేసవి సెలవులు, మెస్లకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నకిలీ సర్క్యులర్ను పోస్ట్ చేసిన ఆరోపణలపై క్రిశాంక్ని అరెస్టు చేశారు. బుధవారం క్రిశాంక్ను కలిసిన అనంతరం చంచల్గూడ జైలు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రామారావు, తనను వేధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్రిశాంక్పై…