కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ సరఫరా, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ అయిందన్నారు. కానీ, అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, 20-30 శాతం కమీషన్లు తీసుకోవడమే కాంగ్రెస్ పని అని ఆరోపించారు.
BRS Silver Jubilee Meeting: ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి.. ఎన్నో అవమానాలు ఎదురైనా.. ఉద్యమమే ఊపిరిగా.. రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న కసితో పోరాడి చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది భారత రాష్ట్ర సమితి.