మార్పు కావాలని.. ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అని కాంగ్రెస్ నీ దివించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లు గా పని చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చాక ఖజానా చూస్తే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ వచ్చిన వెంటనే ఐదు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి పొంగులేటి. కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారు కానీ……
Bus Accident: నేపాల్ దేశంలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిందని సమాచారం. ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి నేపాల్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. Tamilnadu : కూతురిని కాపాడేందుకు భర్తను హత్య చేసిన భార్య..…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు గతంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే గద్దర్ అవార్డుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కమిటీకి చైర్మన్గా ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు, వైస్ చైర్మన్గా ప్రముఖ నిర్మాత దిల్ రాజును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్…
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరేలా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతోపాటు 420 హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలంతా గంపెడాశతో ఎదురు చూస్తున్నారని, ముఖ్యంగా రైతులందరికీ రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో అమలైన తీరుకు పొంతనే లేదన్నారు. నూటికి 70 శాతం మంది రైతులు రుణమాఫీ అందక తీవ్ర…
తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలో ఈ పథకం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించడం ప్రాధాన్యతను వివరించారు.…
గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ వ్యభిచార గృహంలో 17 మంది విదేశీ యువతులను పోలీసులు పట్టుకున్నారు. అంతర్జాతీయ యువతులతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఆర్గనైజ్డ్గా వ్యభిచారం చేయిస్తున్న గుట్టును గచ్చిబౌలి పోలీసులు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు రట్టు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపూర్లోని ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఈ గలీజు దందాను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సదరు…
గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం 2024 డిసెంబర్ 15 మరియు 16 మధ్య రాత పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం తెలియజేసింది. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-I జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ డిసెంబర్ 15, 2024న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహించబడతాయి, పేపర్-II, హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు…
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగో ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ భేటీ అయ్యారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎంను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక…
మా తమ్ముడు దందాలు చేసుకోవచ్చు కానీ.. సెబి చైర్మన్ షేర్లు కొనుక్కోవద్దా రేవంత్ రెడ్డి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం మీద దేశ ప్రజాస్వామ్యం మీద, కోర్ట్ ల మీద రాహుల్ గాంధీ కి నమ్మకం లేదని, బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్త పై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు రఘునందర్ రావు. అదానీ నీ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి…
సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ రావు, వరంగల్, హనుమకొండ జిల్లా కార్యదర్శులు రవి, భిక్షపతి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు మాట్లాడుతూ.. చైతన్య వంతంగా…