గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరేలా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతోపాటు 420 హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలంతా గంపెడాశతో ఎదురు చూస్తున్నారని, ముఖ్యంగా రైతులందరికీ రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో అమలైన తీరుకు పొంతనే లేదన్నారు. నూటికి 70 శాతం మంది రైతులు రుణమాఫీ అందక తీవ్ర…
తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలో ఈ పథకం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించడం ప్రాధాన్యతను వివరించారు.…
గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ వ్యభిచార గృహంలో 17 మంది విదేశీ యువతులను పోలీసులు పట్టుకున్నారు. అంతర్జాతీయ యువతులతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఆర్గనైజ్డ్గా వ్యభిచారం చేయిస్తున్న గుట్టును గచ్చిబౌలి పోలీసులు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు రట్టు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపూర్లోని ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఈ గలీజు దందాను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సదరు…
గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం 2024 డిసెంబర్ 15 మరియు 16 మధ్య రాత పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం తెలియజేసింది. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-I జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ డిసెంబర్ 15, 2024న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహించబడతాయి, పేపర్-II, హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు…
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగో ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ భేటీ అయ్యారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎంను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక…
మా తమ్ముడు దందాలు చేసుకోవచ్చు కానీ.. సెబి చైర్మన్ షేర్లు కొనుక్కోవద్దా రేవంత్ రెడ్డి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం మీద దేశ ప్రజాస్వామ్యం మీద, కోర్ట్ ల మీద రాహుల్ గాంధీ కి నమ్మకం లేదని, బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్త పై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు రఘునందర్ రావు. అదానీ నీ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి…
సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ రావు, వరంగల్, హనుమకొండ జిల్లా కార్యదర్శులు రవి, భిక్షపతి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు మాట్లాడుతూ.. చైతన్య వంతంగా…
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రసరించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు పబ్లిక్ అడ్వయిజరీ జారీ చేశారు. అర్థరాత్రి సమయంలో మహిళలకు “ఉచిత రైడ్ సర్వీస్” గురించి తప్పుడు దావా ఆన్లైన్లో విస్తృతంగా షేర్ చేయబడిన తర్వాత ఇది జరిగింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళలు హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించడం ద్వారా ఉచిత పోలీసు వాహనంలో ఇంటికి వెళ్లడానికి అభ్యర్థించవచ్చని పేర్కొన్న…
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్నిభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లపై దాడి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి… మీ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇద్దరు మహిళ జర్నలిస్ట్…
సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడని, ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ మంత్రులే రుణమాఫీ మొత్తం కాలేదని ఒప్పుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ…