ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే మోసం చేయటంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయటంతో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్ కాలనీలో నివసించే తాళ్ళపల్లి రాజశేఖర్ ప్రస్తుతం అల్వాల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దే ఉన్న మనీషా(27) అనే యువతిని ప్రేమించటంతో, ఆ యువతి వారి ప్రేమ…
రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష లో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో నాణ్యమైన వైద్య విద్య ను అందించడంతోపాటు మెడికల్ UG, PG అడ్మిషన్ ల భర్తీపై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్య ను అందించడమే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కృషి చేయాలని మంత్రి అధికారులను…
కూల్చివేతల వెనుక రాజకీయ హస్తముందా.? అధికార పార్టీ నేతల అక్రమకట్టడాలు కూడా కూలుతాయ? కూల్చివేతలు వసూళ్లకేనన్న ఆరోపణల్లో వాస్తవమెంత? 111 జీవో భూముల్లో కూడా హైడ్రా ఎంట్రీ అవుతుందా.? హైడ్రా టార్గెట్ సామాన్యులా.? బడాబాబులా.? హైడ్రా అసలు లక్ష్యమేంటి?.. ఇవాళ హైడ్రా కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్పై దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఎన్టీవీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చూడండి…
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి,పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండని, రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ఎంత పెద్ద వాళ్లు ఉన్న చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు…
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు రి కన్స్ట్రక్షన్ అవుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైల్వే కేంద్ర సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్ మాట్లాడుతూ.. 712 కోట్లతో మొదటి విడత స్టేషన్ అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అధునాతనమైన టెక్నాలజీ అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 8 అంశాలపై కేంద్ర ఆర్ధిక మంత్రి కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. కేంద్ర మంత్రి చాలా సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సహాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, పెండింగ్ నిధులను వెంటనే విడదల…
జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించి.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుదల, విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గారు.. మొన్న ఫారుఖ్ అబ్దుల్లా ఇంటికెళ్లి ఒప్పందం చేసుకుని వచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ కిషన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై కాంగ్రెస్ ఆలోచన ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని.. అన్న నేషనల్ కాన్ఫరెన్స్ ని సమర్థిస్తారా? అని ఆయన…
రాష్ట్రంలోని 25,000 మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ (బిఎఎస్) కోసం నిధులు విడుదల చేయాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్దిపేట ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు శనివారం కోరారు. తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు రాసిన లేఖలో హరీశ్రావు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరంలో ₹130 కోట్లు కేటాయించారని, మొదటి విడతగా ₹ 50 కోట్లు విడుదల…
జంటనగరాల్లో జరగనున్న గణేష్ చతుర్థి వేడుకలపై చర్చించేందుకు శనివారం అంతర్ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. GHMC, HMWS&SB, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్, పోలీస్, TSRTC, మెట్రో రైల్, దక్షిణ మధ్య రైల్వే, TGSPDCL, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇరిగేషన్, టూరిజం, EMRI , భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి , ఖైరతాబాద్ గణేష్ సమితి…
మహిళపై పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ప్రతి పక్ష పోషిస్తున్నారా అర్థం కాట్లేదని, మమ్ముల్ని జుట్టు పట్టుకుని బూట్లతో తన్నారని ఆమె ఆరోపించారు. సీపీ విచారణ చేసి యూనిఫాం వేసుకున్న దొంగ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు బ్రేక్ డాన్స్ లు వేస్తారన్న కేటీఆర్ ఇంట్లో కూడా బ్రేక్ డాన్స్ లు వేస్తున్నారా…