భారత్తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్ట్ మ్యాచ్కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 13 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను ఎవరు ఆరంభిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇటీవల భారత్-ఎతో అనధికార టెస్టులో ఓపెనర్గా రాణించిన నాథన్ మెక్స్వీనీ టీమిండియాపై అరంగేట్రం చేయనున్నాడు. మెక్స్వీనీ భారత్-ఏపై రెండు ఇన్నింగ్స్ల్లో 39, 88 పరుగులు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా దేశవాళీ ఫస్ట్క్లాస్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్…
భారత్తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఐదు మ్యాచుల సిరీస్లో భాగంగా తొలి టెస్టుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టును శనివారం వెల్లడించింది. ఆసీస్ జట్టులోకి ఓ కొత్త ప్లేయర్ వచ్చాడు. భారత్-ఏతో అనధికారిక టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఏకు సారథ్యం వహించిన నాథన్ మెక్స్వీనేకు అవకాశం దక్కింది.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ హ్యాట్రిక్ కొట్టనీయకుండా చూస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అంటున్నాడు. మైదానంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే తాము దృష్టిసారించాం అని తెలిపాడు. మమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు నష్టమేనని తెలిపాడు. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరకుండా అడ్డుకుంటామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు ముందు కమిన్స్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. మైదానంలో టీమిండియా అభిమానులను నిశ్శబ్దంగా ఉంచుతాం అని చెప్పి…
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ అందరికంటే ముందుగానే కంగారో గడ్డపైకి అడుగుపెట్టారు. నేడు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో ఆరంభమైన అనధికారిక రెండో టెస్టులో బరిలోకి దిగారు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో విఫలమైన రాహుల్ ఈ టెస్టులో అయినా రాణిస్తాడనుకుంటే.. మరలా నిరాశపరిచాడు. ఓపెనర్గా వచ్చి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు యువ ఆటగాడు ధ్రువ్…
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో వెనకపడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో సిరీస్ విజయంతో పాటు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధించాలంటే.. న్యూజిలాండ్ సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన రోహిత్ సేన గొప్పగా పుంజుకోవాల్సి ఉంది. సిరీస్ గెలవాలంటే సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గాడిలో…
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత్.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత రెండు సిరీస్లు గెలుచుకున్న టీమిండియా.. హ్యాట్రిక్పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ ఐదు మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి. కీలక సిరీస్ కాబట్టి భారత ఆటగాళ్లు ముందుగానే కంగారో గడ్డపై అడుగుపెడుతున్నారు. ఇప్పటికే బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లు ఆస్ట్రేలియా చేరుకున్నారు.…
న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడమే కాకుండా.. వైట్ వాష్ ఇవ్వడంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కివీస్ టెస్ట్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లను వారం ముందుగానే కంగారో గడ్డపైకి పంపనుంది. న్యూజిలాండ్ సిరీస్లోని…
Abhimanyu Iswaran: రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టుపై బెంగాల్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికిది వరుసగా నాలుగో సెంచరీ. అంతకుముందు దులీప్ ట్రోఫీలో రెండో, మూడో మ్యాచ్ల్లో సెంచరీలు సాధించాడు. ఇరానీ కప్లోనూ తన బ్యాట్తో సెంచరీ సాధించాడు. అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో ఇది 27వ సెంచరీ. ఇక ప్రస్తుతం జరుగుతున్న రంజిలో బెంగాల్ పోటీలో తన పట్టును…