Bomb attack in Pakistan, Train derailed: పాకిస్తాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఓ వైపు బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’, మరోవైపు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్సులో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. బాంబు దాడిలో 15 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు.