భారతీయ సంగీత శిఖరం, వేలాది మధుర గీతాలతో కోట్లాది మందిని అలరించిన పద్మవిభూషణ్ ఆశా భోస్లే (92) ఇక లేరు. గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. సంగీత ప్రియులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా…