Madhya Pradesh: మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ అనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 19వ శతాబ్దపు సామాజిక సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్ను ‘‘బ్రిటిష్ ఏజెంట్’’గా పిలిచారు. అగర్ మాల్వాలో జరిగిన బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ సమాజాన్ని కులాల వారీగా విభజించడానికి బ్రిటిష్ వారి తరుపున పనిచేసినట్లు ఆరోపించారు.
Birsa Munda Jayanti: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన గిరిజన సమాజానికి ఓ ప్రత్యేక కానుకను అందించనున్నారు. దీని కింద మధ్యప్రదేశ్లో ఉన్న రెండు ‘గిరిజన స్వాతంత్య్ర సమర’ మ్యూజియంలను ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభిస్తారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అద్భుతమైన చరిత్ర కలిగిన బిర్సా ముండా జయంతి ప్రతి సంవత్సరం నవంబర్ 15 న జరుపుకుంటారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా, జబల్పూర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంలను…