డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. దాదాపు అందరు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ప్రతి రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ఉపయోగించే దేశాల జాబితాలో ఖతార్ చేరింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజధాని దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో, UPI అనేది…
India-UK trade deal: భారత్, యునైటెడ్ కింగ్డమ్(యూకే)ల మధ్య అతిపెద్ద ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)’’ కుదిరింది. గురువారం మైలురాయిగా నిలిచే ఈ ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్స్ సంతకాలు చేశారు. 2020లో యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి యూకే నిష్క్రమించిన తర్వాత, ఆ దేశం చేసిన అతిపెద్ద ఒప్పందం ఇదే. లండన్లో మోడీ, స్టార్మర్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత…
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 21-24 మధ్య భారత్ సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ కూడా ఆయన వెంట ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు ఉంటాయని, అధికారిక కార్యక్రమాలతో పాటు జైపూర్, ఆగ్రాలను సందర్శించవచ్చని తెలుస్తోంది.