UPI: ఖతార్ లో UPI సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్..
- ఖతార్ లో UPI సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్
- దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. దాదాపు అందరు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ప్రతి రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ఉపయోగించే దేశాల జాబితాలో ఖతార్ చేరింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజధాని దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో, UPI అనేది డిజిటల్ చెల్లింపు పద్ధతి మాత్రమే కాదు, భారతీయ ఆవిష్కరణ, సాంకేతికత శక్తికి చిహ్నం అని పియూష్ గోయల్ తెలిపారు.
Also Read:Rohit Sharma: కెప్టెన్సీ లేని అతడు మరింత ప్రమాదకరం.. మళ్లీ పాత రోహిత్ను గుర్తు చేస్తాడా..?
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
రెండు రోజుల ఖతార్ పర్యటన సందర్భంగా, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ యుపిఐ వ్యవస్థను ప్రారంభించారు. ఇది భారతదేశం-ఖతార్ భాగస్వామ్యాన్ని పెంచుతోందన్నారు. భారతదేశంలో 85% డిజిటల్ చెల్లింపులు ఈ వ్యవస్థ ద్వారా జరుగుతుండగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50% డిజిటల్ చెల్లింపులు యుపిఐ ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. ఖతార్ నేషనల్ బ్యాంక్ (QNB), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో కలిసి, తన వ్యాపారి క్లయింట్ల కోసం పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్లో QR కోడ్ ఆధారిత UPI చెల్లింపులను ప్రారంభించింది.
ఖతార్లోని లులు అవుట్లెట్లు ఇప్పుడు భారతీయ చెల్లింపు వ్యవస్థ ద్వారా లావాదేవీలను అంగీకరిస్తుండటంతో, భారతదేశం నుండి వచ్చే పర్యాటకులు ఖతార్లో సులభమైన, సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపులను చేయొచ్చు. ఈ సేవలతో నగదు తీసుకెళ్లడం లేదా కరెన్సీ మార్పిడి అవసరం తగ్గుతుంది. దోహాలో UPIని ప్రారంభించడంతో పాటు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్.. ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి హిజ్ హైనెస్ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థానితో కూడా సమావేశం అయ్యారు. ఆర్థిక, వాణిజ్య సహకారంపై చర్చించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!