UPI: ఖతార్ లో UPI సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్..
- ఖతార్ లో UPI సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్
- దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. దాదాపు అందరు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ప్రతి రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ఉపయోగించే దేశాల జాబితాలో ఖతార్ చేరింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజధాని దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో, UPI అనేది డిజిటల్ చెల్లింపు పద్ధతి మాత్రమే కాదు, భారతీయ ఆవిష్కరణ, సాంకేతికత శక్తికి చిహ్నం అని పియూష్ గోయల్ తెలిపారు.
Also Read:Rohit Sharma: కెప్టెన్సీ లేని అతడు మరింత ప్రమాదకరం.. మళ్లీ పాత రోహిత్ను గుర్తు చేస్తాడా..?
Also Read
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- Mohammad Rizwan - Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ - బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
- Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
రెండు రోజుల ఖతార్ పర్యటన సందర్భంగా, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ యుపిఐ వ్యవస్థను ప్రారంభించారు. ఇది భారతదేశం-ఖతార్ భాగస్వామ్యాన్ని పెంచుతోందన్నారు. భారతదేశంలో 85% డిజిటల్ చెల్లింపులు ఈ వ్యవస్థ ద్వారా జరుగుతుండగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50% డిజిటల్ చెల్లింపులు యుపిఐ ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. ఖతార్ నేషనల్ బ్యాంక్ (QNB), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో కలిసి, తన వ్యాపారి క్లయింట్ల కోసం పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్లో QR కోడ్ ఆధారిత UPI చెల్లింపులను ప్రారంభించింది.
ఖతార్లోని లులు అవుట్లెట్లు ఇప్పుడు భారతీయ చెల్లింపు వ్యవస్థ ద్వారా లావాదేవీలను అంగీకరిస్తుండటంతో, భారతదేశం నుండి వచ్చే పర్యాటకులు ఖతార్లో సులభమైన, సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపులను చేయొచ్చు. ఈ సేవలతో నగదు తీసుకెళ్లడం లేదా కరెన్సీ మార్పిడి అవసరం తగ్గుతుంది. దోహాలో UPIని ప్రారంభించడంతో పాటు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్.. ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి హిజ్ హైనెస్ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థానితో కూడా సమావేశం అయ్యారు. ఆర్థిక, వాణిజ్య సహకారంపై చర్చించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!