పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ ప్రమాదంలో చనిపోయిన బస్ డ్రైవర్ షరీఫ్ అని పోలీసులు తెలియజేస్తున్నారు. దీంతో షరీఫ్ అనే పేరుతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్రైవర్ రాకపోవడంతో తానే డ్రైవింగ్ కు వచ్చానని అంజి చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య, ధర్మసాగరం మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నవ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు తేల్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా సరైన ఆధారాలు సమర్పించలేదని పోలీసులు వెల్లడించారు.