శనివారం.. వేంకటేశ్వరస్వామికి ఎంతో ఇష్టమయిన రోజు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని వారు శనివారం ఆయన స్తోత్రపారాయణం చేయడం స్వామిని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది.
హనుమాన్ చాలీసా వింటే సర్వాభీష్ట సిద్ధి, దుష్ట నివారణ కలుగుతుంది. చిరంజీవిగా పేరున్న అంజనీపుత్రుడి కటాక్ష వీక్షణాలు మనకు కలుగుతాయి. అంతులేని సంపద మనకు స్వంతం అవుతుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆంజనేయుడిని తలచుకుంటే భయం పోతుంది.
శనివారం వేంకటేశ్వరుడికి ఎంతో ప్రీతీపాత్రమయింది. శనివారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మొదటి, రెండు, మూడు పర్యాయాలు పఠించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని వేదాల్లో తెలిపారు. మన జీవితంతో ధర్మాన్ని తెలుసుకునేందుకు అవకాశం, శక్తి సరిపోదని, దీనిని సులభంగా తెలుసుకునేందుకు విష్ణు సహస్రనామాన్ని భీష్మాచార్యులు ధర్మరాజుకు వివరించగా మహావిష్ణువు ఆమోదించారు. అందువల్ల ఎవరైతే విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వాళ్లు భగవంతుడి సన్నిధికి చేరుతారని, ఇదే ముక్తికి మార్గం అని పండితులు చెబుతున్నారు.
ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వైభవంగా సాగుతోంది. ఇవాళ్టికి 13వ రోజుకి చేరింది. ఆదివారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇవాళ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. వేలాదిమంది భక్తులు తరలివస్తుండడంతో శ్రీరామనగరం భక్త జన సంద్రంగా మారింది.