Miss World 2025: వరంగల్ జిల్లా నేడు ప్రపంచ అందాల భామలతో కళకళలాడింది. మిస్ వరల్డ్ పోటీదారుల రెండు బృందాలు జిల్లాలో పర్యటించాయి. మొదటి బృందంలో 22 మంది, రెండవ బృందంలో 35 మంది సుందరీమణులు ఉన్నారు. మొదటి బృందానికి చెందిన 22 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తొలుత చారిత్రాత్మక వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శించి, అనంతరం ఖిలా వరంగల్ కోట యొక్క వైభవాన్ని తిలకించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఈ బృందం…
Miss World 2025 : ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న క్రమంలో.. అలాగే దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ట్రైడెంట్ హోటల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఈ హోటల్లోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న అందమైన కంటెస్టెంట్లు బస చేస్తున్నారు. ట్రైడెంట్ హోటల్ భద్రతా బాధ్యతలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హోటల్లో ఆక్టోపస్ టీమ్తో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్ పోలీసులు హోటల్లో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు…