బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డికి ఆర్.కృష్ణయ్య ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు ఇచ్చిన నాటి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తన ఫోన్ నంబర్ను సోషల్ మీడియాలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు.…
దేశవ్యాప్తంగా బీసీల మీద కుట్ర జరుగుతోందని.. అంతా అప్రమత్తంగా వుండి ఎదుర్కోవాలన్నారు ఆర్ కృష్ణయ్య. హుజూరాబాద్ లోనే కాదు… దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ దోపిడీని ఎత్తిచూపిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో దండోరా వేస్తాం అన్నారు ఆర్ కృష్ణయ్య. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల మీద కనిపించని కుట్ర జరుగుతోందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. పేద వర్గాలను లేబర్ గా ఉంచాలన్నదే కేంద్రం కుట్రగా కనిపిస్తోందన్నారు.…