తెలంగాణ ద్రోహులు అంతా కేసీఆర్ పక్కన ఉన్నారని ఎద్దేవా చేశారు. 24వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన జడ్చర్ల నియోజకవర్గం నక్కలబండ తండాకు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జడ్చర్లలోని 600 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 1500 కోట్ల విలువైన 120 ఎకరాలను కబ్జా చేసిన ఘనులు టీఆర్ఎస్ నేతలేనని అన్నారు. టీఆర్ఎస్ నేతలు జనాన్ని దోచుకుంటున్నరని అన్నారు. చివరకు పేదల, ఆరె కటికెల భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం…