బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ 2025 డిసెంబర్ 5న విడుదలైంది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూళ్లను దాటింది. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న రిలీజ్ కాబోతోంది. అయితే బాలీవుడ్లో ధురంధర్ తుఫాను మధ్య రణవీర్ నటించిన ఓ రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.…