దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. కరోనా కారణంగా గతేడాది దీపావళి పండుగను ప్రజలు చేసుకోలేదు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈసారి రెండురోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ఏర్పడింది. ఉదయాన్నే పూజలు చేసి, శుభం కలగాలని కోరుతూ పండుగను చేసుకుంటున్నారు. సాయంత్రం ప్రజలు ఆరుబయటకు వచ్చి బాణా సంచా కాల్చూతూ పండుగను నిర్వహించుకుంటున్నారు. హైదరాబాద్లో వివిధ కమ్యూనిటీల్లో ప్రజలు బాణా సంచా కాల్చుతూ పండుగను చేసుకుంటున్నారు. ఈ సారి గ్రీన్ కాకర్స్నే కాల్చుతు…