మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి మ్యాచ్ నేడు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో మూడో వన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది. స్వదేశంలో మరో సిరీస్ను చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత్ ఉండగా.. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ సాధించాలని కివీస్ తహతహలాడుతోంది. ఈ…
మూడు వన్డేల సిరీస్లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. జాడెన్ లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో…
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని బలమైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ఈ మ్యాచ్కు భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. యువ బ్యాటర్ ఆయుష్ బదోనికి ఈ మ్యాచ్తో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం…
భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగతా వన్డే మ్యాచ్లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్రౌండర్ ఆయుష్ బదోనిని జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. 26 ఏళ్ల బదోని భారత జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. బుధవారం రాజ్కోట్లో జరిగే రెండో వన్డేకు అతడు అందుబాటులోకి రానున్నాడు. బదోని బ్యాటర్ మాత్రమే కాదు.. ఆఫ్ స్పిన్నర్ కూడా. మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్…
LSG vs RR: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్పై 2 పరుగుల తేడాతో సెన్సేషనల్ విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బ్యాట్స్మెన్లలో యశస్వి జైస్వాల్ 74 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రియాన్ పరాగ్ 39, వైభవ్ సూర్యవంశీ 34 పరుగులు చేశారు. చివరి…
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) గుజరాత్ టైటాన్స్ (GT)ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఏప్రిల్ 12న (శనివారం) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో ఘన విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని లక్నో 4 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగా ఛేదించింది. మార్క్రమ్ (58), నికోలస్ పూరన్…
ఐపీఎల్ ద్వారా మరో యువ కెరటం వెలుగులోకి వచ్చింది. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా లక్నో ఆటగాడు ఆయుష్ బదోనీ తన సత్తా చూపించాడు. అయితే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే అతడు రికార్డు సృష్టించాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఆయుష్ బదోనీ మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా 41…