సినీ పరిశ్రమలో నటులకు కోట్లాది రూపాయల పారితోషికాలు, లగ్జరీ కార్లు, సమాజంలో గౌరవం లభిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం సగటు ప్రేక్షకులు. అభిమానులు తమ కష్టార్జితాన్ని వెచ్చించి థియేటర్లకు వస్తేనే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. కానీ, తాజాగా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపుపై స్పందిస్తూ.. ‘సినిమాలు చూడకండి, ఎవడి వ్యాపారం వాడిది’ అంటూ నిర్లక్ష్యంగా…