అంతరిక్ష పరిశోధనలో పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్న చైనా మరో ముందడుగు వేసింది. దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2030 నాటికి మానవ సహిత మిషన్ను పంపాలని డ్రాగన్ భావిస్తోంది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది.
ఆరు నెలల స్పేస్ మిషన్ తర్వాత ముగ్గురు చైనీస్ వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు స్పేస్ స్టేషన్ కాంప్లెక్స్లో 183 రోజులు పనిచేశారు.