రాష్ట్ర రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గింది అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. 2025- 26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 41, 118.36 కోట్లుకు చేరింది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 22, 002.50 కోట్లు ఉంది.
AP Budget 2026-27: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. 75,868…