జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామానికి చెందిన తవిటి వెంకటేష్ జనసేన కార్యకర్త. అతడు ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంకటేష్ మరణవార్తను తూ.గో. జిల్లా జనసేన నేతల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే చలించిపోయి ఆర్థిక సాయం ప్రకటించారు. సాధారణంగా జనసేన కార్యకర్తలకు…
ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతూ వచ్చిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది.. మొదట పొలిట్బ్యూరో సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ను వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నా… ఇవాళ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మాత్రం సభకు వెళ్లేందుకే…
తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన ఓ చెల్లెలు దారుణ హత్యకు గురైంది. కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన కొవ్వాసి నంద చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో తన అక్క దగ్గర నివసిస్తోంది. ఇటీవల అన్నను చూసేందుకు కన్నాపురం గ్రామానికి వచ్చింది. అయితే కొవ్వాసి నంద భార్య రెండు రోజుల క్రితం పుట్టింటికి…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు తర్వాత.. రాజధాని అమరావతి మరోసారి తెరపైకి వచ్చింది.. అయితే, తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. అదే తమ విధానం అంటూ స్పష్టం చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు.. అతి అమరావతి కాదు కమ్మరావతి అని దుయ్యబట్టారు. మూడు రాజధానులకు చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన.. ప్రతివిషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఆర్డీఏ…
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నమని ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల పై స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అన్ని శాఖల అధికారులుతో సమీక్ష నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి.. అసెంబ్లీలో ప్రజాసమస్యలను అత్యంత ప్రధాన్యంగా సమావేశాలు నిర్వహిస్తాం అన్నారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న ఆయన.. గతంలో టీడీపీలా కాకుండా మేం ప్రతిపక్షాన్ని…
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో వెనక్కి తీసుకోవాలని.. కరోనా కారణంగా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. మరోవైపు చేనేత కళాకారులను గుర్తించి…
రాష్ట్రంలో అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది.. ఈ పోరాటంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపిన ఆయన.. అయితే, మంగళగిరి నియోజవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ అనుకున్నాం.. కానీ, జనసేన ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి వీల్లేని విధంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు.. స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులపై అధికారులు…
ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. రాజధానిపై శాసన అధికారం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం తనను బాధించిందని లేఖలో ధర్మాన తెలిపారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన నిర్మాణం, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను స్పష్టంగా నిర్ణయించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య…
హైకోర్టు తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఓవైపు.. లేదు మూడు రాజధానులే మా విధానం అంటూ మరోవైపు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, ఈ వ్యవహారంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఒకటికి పది సార్లు చెబుతున్నాం… మేం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. పాలనా వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమన్న ఆయన.. రాష్ట్ర విభజన…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.. ఫిబ్రవరి 22 నుండి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామి అమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహనసేవలో భాగంగా సాయంకాలం స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఇక, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో రేపటి (శనివారం) నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు శ్రీశైలం టెంపుల్ ఈవో లవన్న. Read Also: Ukraine Russia War: జెలెన్స్కీ హత్యకు మూడు కుట్రలు..! గర్భాలయ…