Amritpal Singh:పరారీలో ఉన్న ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఢిల్లీ నుంచి పంజాబ్ కు అతడు వచ్చినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అమృత్ సర్ స్వర్ణ దేవాలయం వద్ద అమృత్ పాల్ సింగ్ లొంగిపోయేందుకు వస్తున్నట్టు సమాచారం. మార్చి 18న భారీ ఆపరేషన్ నిర్వహించిన పంజాబ్ పోలీసులు అతడిని పట్టుకునేందుకు గత 12 రోజులగా ప్రయత్నిస్తున్నారు. అయితే హర్యానా మీదుగా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.