బీజేపీ మాజీ అదికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారి తీసింది. అయితే నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన కారణంగా మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 21న తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వస్తున్న సమయంలో ఉమేష్ కోల్హేని కత్తితో పొడిచి హత్య చేశారు.
దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన ఉదయ్ పూర్ ఘటనలో ఎన్ఐఏ మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. టైలర్ కన్హయ్యలాల్ హత్య చేసిన కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ఫర్హాద్ మహ్మద్ షేక్ అలియాస్ బాబ్లాను శనివారరం సాయంత్రం అరెస్ట్ చేశారు. కన్హయ్యలాల్ ను హత్య చేసి నిందితుల్లో ఒకడైన రియాజ్ అక్తరీకి సన్నిహితంగా ఉన్నాడని.. ఆయనను చంపే కుట్రలో పాల్గొన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జూన్ 28న…