ప్రేమకు చావు లేదని చాటిచెప్పే ఉదంతాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. సుమారు 22 ఏళ్ల క్రితం విడిపోయిన ఇద్దరు ప్రేమికులను, వారి తల్లిదండ్రులు దైవస్వరూపులుగా భావిస్తూ ఏటా శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా వారికి ఘనంగా వివాహం జరిపిస్తున్నారు. ఈ కథకు మూలం 22 ఏళ్ల క్రితం మొదలైంది. తండాకు చెందిన రామకోటి అనే యువకుడు ఒక యువతిని ప్రాణంగా…