Today Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్కి ఈ వారం శుభారంభం లభించలేదు. ఇవాళ సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు.. సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. బెంచ్ మార్క్ విలువల కన్నా కింద క్లోజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతుండటం వల్ల ఇంట్రాడేలో నష్టాలు మరింత పెరిగాయి. ఐటీ.. మెటల్.. మరియు కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కొన్నాయి.