ఏపీలో ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. గతంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. తాజాగా 26 జిల్లాలకు పెరగనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గం అని దుయ్యబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జిల్లాల ఏర్పాటు అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైనా సీఎం ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో హేతుబద్ధమైన సూచనలను కూడా బేఖాతరు చేయడం…