అమెరికా- ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ నివాస స్థలాన్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపింది అమెరికా. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా నిర్ధారించింది. 40 రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది ఇరాన్. ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ పాలన 37 సంవత్సరాలు కొనసాగింది. ఇరాన్ రాజకీయాల్లో హార్డ్లైనర్గా పేరు. ఆయన మరణంతో ఇరాన్ భవిష్యత్తు ఎలా మారుతుందో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.…