No.of Airports in India After Modi: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక.. దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య దాదాపు రెట్టింపయింది. ఆయన తొలిసారి 2014లో ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 140కి పెరిగాయి. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య ట్రిపుల్ కానుందని.. అంటే.. 220కి చేరనుందని అధికారులు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు గోవాలో మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.