Air India: టాటా గ్రూపు సొంతం చేసుకున్న తర్వాత ఎయిరిండియా రూపు రేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన టాటా, ఇప్పుడు తన పైలట్లు, సిబ్బందికి కొత్త యూనిఫాంని ఈ రోజు విడుదల చేసింది. 1932లో స్థాపించిబడిన ఈ ఎయిర్లైన్ తన యూనిఫామ్ని మార్చడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరినాటికి విడుదల కానున్న కొత్త యూనిఫామ్ ‘‘ఎయిరిండియా గొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం’’ అంటూ ట్వీట్ చేసింది.