ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కూడా క్షమాపణలు కోరారు. అయితే తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వ్యవసాయంపై ప్రధాని కమిటీ ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ వ్యవసాయం, “కనీస మద్దతు ధర”లో పారదర్శకత లాంటి అంశాలను కమిటీ…