ఇంజనీరింగ్ కాలేజీల్లో బి కేటగిరి(యాజమాన్య కోట) సీట్లు నిబంధనలకు విరుద్దంగా కేటాయిస్తున్నారని, కొన్ని కాలేజిలో ఇప్పటికే సీట్లు అమ్ముకున్నారని అడ్మిషన్స్, ఫి రెగ్యులేటరీ కమిటీ కి ఫిర్యాదు చేసింది ఏబీవీపీ. ఈ ఫిర్యాదు పై స్పందించిన ఫీజుల నియంత్రణ కమిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లకు సర్క్యులర్ జారీ చేసింది. ఏ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్ పూర్తి అయ్యాకే యాజమాన్య కోట సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. నోటిఫికేషన్ ఇచ్చే అడ్మిషన్స్ చేపట్టాలి. మెరిట్ ప్రకారమే అడ్మిషన్స్ ఇవ్వాలి.…