ఈమధ్యకాలంలో వన్యప్రాణులు అరణ్యాలు వీడి జనవాసాలకు చేరుతున్నాయి. చిరుతలు జనం మీదకు వస్తున్నాయి. ఇళ్ళలో వుండే ఆవులు, మేకలు, గొర్రెల్ని హతమారుస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర లో కూరగాయల ట్రేలో దూరిందో చిరుత కూన. చంద్రపూర్ జిల్లాలోని మూల్ తాలూకా లోని ఉథడ్ పేట్ గ్రామ రైతు కిన్నకే అనే రైతు కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో పొలంలో కూరగాయలు తెంపి ట్రే లో పోసే క్రమంలో పై కప్పి ఉంచిన గోతాన్ని తీశాడు. అప్పటికే అక్కడ చిరుతపులి…
ఆదిలాబాద్లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్లో ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. దాదాపు ఏజెన్సీ అన్ని ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి.దట్టమైన మంచు పొగ మంచు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం పూట పనుల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో…