సమాజంలోని సంచలన సంఘటనలను సినిమాలుగా తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకు కొత్త కాదు. ఆ తరహా చిత్రాల ద్వారా సమాజానికి వర్మ ఏం సందేశం ఇస్తున్నారు అనే దానికంటే… తన పాపులారిటీని పెంచుకోవడానికి ఆ సంఘటనలను వాడుకుంటున్నారు అనేది వాస్తవం. శంషాబాద్ సమీపాన 2019లో జరిగిన దిశ హత్య, ఆపైన జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో వర్మ ‘ఆశ: ఎన్ కౌంటర్’ పేరుతో ఓ సినిమా తీశారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా…