ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతుల పిల్లల చదువు కోసమే ఖర్చు చేస్తానని హర్భజన్ స్పష్టం చేశాడు. ఒక రాజ్యసభ సభ్యుడిగా రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం తన వేతనాన్ని వారికే ఇచ్చేస్తున్నానని హర్భజన్ ట్వీట్ చేశాడు. మన దేశం అభివృద్ధి చెందేందుకు తన వంతు సాయం చేస్తానని పేర్కొన్నాడు. దేశాన్ని మరింత ఉన్నతంగా…
గుజరాత్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఇటీవల పంజాబ్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో కూడా విజయబావుటా ఎగురవేయాలని పట్టుదలతో కనిపిస్తోంది. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్డిక్ పటేల్ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. కాంగ్రెస్ లాంటి పార్టీలో హార్డిక్ పటేల్ వంటి నేతలు ఉండకూడదని గుజరాత్ ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు…