ఇండియాలో కరోనా కేసులతో పాటుగా మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కొత్తగా 62,480 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,62,793 కి చేరింది. ఇందులో 2,85,80,647 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,98,656 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1,587 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,83,490 కి చేరింది.…