పాకిస్థాన్ ప్రస్తుతం ఉగ్ర ముప్పును ఎదుర్కొంటోంది. బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు, ఆప్ఘనిస్థాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పాకిస్థాన్ పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.