భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం నాలుగోరోజుకు చేరింది. కార్తీక మాసాన జరుగుతున్న ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మికంగా పరవశింపబడ్డారు. ఈరోజు కోటిదీపోత్సవం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. సోమవారం సాయంత్రం తొలుత శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీసిద్ధేశ్వరానందగిరి మహారాజ్, బర్దీపూర్, శ్రీలలితా పీఠం శ్రీ స్వరూపానందగిరి…
భక్తి టీవీ కోటిదీపోత్సవం నాల్గవ రోజుకి చేరుకుంది. కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. వేలాదిమందిని భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తోంది. నాల్గవ రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ్టి కార్యక్రమాల్లో శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీసిద్ధేశ్వరానందగిరి మహారాజ్, బర్దీపూర్, శ్రీలలితా పీఠం శ్రీ స్వరూపానందగిరి అనుగ్రహ భాషణం వుంటుంది. అనంతరం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనామృతం వుంటుంది. వేదికపై పూజలో భాగంగా…