పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలకు, ఉత్తరప్రదేశ్లో మూడో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైన సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రాష్ట్రాల ప్రజలను ముఖ్యంగా యువతతో పాటు మొదటిసారి ఓటు వేయబోతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ‘పంజాబ్ ఎన్నికలు, యూపీ మూడో దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈరోజు ఓటు వేసే వారందరికీ, ప్రత్యేకించి యువతతో పాటు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్లో…
ఉత్తరప్రదేశ్లో శాంతి, ప్రగతి కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరప్రదేశ్ ప్రజలను కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్త భవిష్యత్తు ఏర్పడుతుందని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు. “ఓటింగ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దేశమంతటా మార్పు వస్తుంది! శాంతి, ప్రగతి కోసం ఓటు వేయండి – కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్త భవిష్యత్తు ఏర్పడుతుంది’ అని ట్వీట్ చేశారు.ఉత్తరప్రదేశ్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు 59 నియోజకవర్గాల్లో…
ఉత్తరప్రదేశ్లోని 16 జిల్లాల్లో 59 నియోజకవర్గాలకు ఈరోజు మూడో విడత పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్లో కూడా నేడు ఓటింగ్ జరగనుంది. పంజాబ్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. యూపీలో ఈ రోజు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు జరిగే మూడో దశలో 627 మంది…