ఓ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన జోగులంబ గద్వాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని కెటిదొడ్డి మండలం ఇర్లబండ గ్రామ శివారులో గద్వాల పట్టణానికి చెందిన వెలుగు రమణకు 7 ఎకరాల పొలం ఉంది. జీవన ఉపాధి నిమిత్తం అమనగల్ ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే తన భూమి కజ్జాకు గురవుతుందంటూ వెంటనే సర్వే చేయాలని పలుసార్లు జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఆపై కెటిదొడ్డి మండలానికి చెందిన సర్వేయర్ తిక్కన్నను ఆశ్రయించాడు.…