Cricket: బీసీసీఐపై యువరాజ్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2007లో టీ20 ప్రపంచకప్కు ముందు భారత కెప్టెన్గా ఎంతో మంది సీనియర్లను కాదని బీసీసీఐ ధోనీని నియమించింది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్కు సీనియర్లు దూరంగా ఉండటంతో యువరాజ్కు కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ అనూహ్యంగా ధోనీకి పగ్గాలు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు.
2007లో తాను కెప్టెన్ కావాల్సిందని.. కానీ అప్పుడు గ్రెగ్ ఛాపెల్ ఘటన జరిగిందని.. అది ఛాపెల్ వర్సెస్ సచిన్ వివాదంలా మారడటంతో టీమ్లో తానొక్కడినే సచిన్కు మద్దతు పలికానని యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాను సచిన్కు మద్దతు ఇవ్వడం బీసీసీఐలోని కొందరు అధికారులకు నచ్చలేదని… దీంతో తనను కాకుండా టీమ్లో వేరేవాళ్లను కెప్టెన్గా చేయాలని సెలక్టర్లు అభిప్రాయపడటంతో తనకు కెప్టెన్సీ దక్కలేదని యువరాజ్ వాపోయాడు. తర్వాత వైస్ కెప్టెన్సీ నుంచి తనను తొలగించారని గుర్తుచేసుకున్నాడు.
Also Read
- Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ఆ సమయంలో టీమ్లో సెహ్వాగ్ లేకపోవడంతో తనకే కెప్టెన్సీ వస్తుందని భావించానని.. కానీ ఛాపెల్ వివాదం తనకు కెప్టెన్సీ దక్కకుండా చేసిందని యువరాజ్ పేర్కొన్నాడు. అయితే ధోనీ అద్భుతంగా కెప్టెన్సీ వహించాడని కొనియాడాడు. తనకు కెప్టెన్సీ దక్కడంలో తనకు ఎలాంటి అసూయ లేదన్నాడు. కాగా 2007 ప్రపంచకప్లో యువరాజ్ మంచి ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్పై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్కు ముందు ఇంగ్లండ్ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ చేయగా.. యువరాజ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!