IND vs AUS 2nd ODI: ఘోర పరాజయం.. టీమిండియా పేరిట చెత్త రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worst Records Created By Team India After Big Loss Against Australia: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఎంత దారుణమైన ఓటమిని చవిచూసిందో అందరికీ తెలిసిందే! బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ ఘోరంగా విఫలమైంది. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి భారత జట్టు పేకమేడల్లా కుప్పకూలింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (31), ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (29 నాటౌట్) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వాళ్లందరూ తీవ్రంగా నిరాశపరిచారు. మొత్తం ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వగా.. అందులో నలుగురు డకౌట్ అయ్యారు. దీంతో.. భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51), మిచెల్ మార్ష్ (66) మెరుపు బ్యాటింగ్తో పరుగుల వర్షం కురిపించి.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని సాధించారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా తన పేరిట కొన్ని చెత్త రికార్డుల్ని నమోదు చేసుకుంది.
Bhanushree Mehra: బన్నీ ‘బ్లాక్’ వివాదం.. పెగ్గేస్తూ వివరణ ఇచ్చిన భానుశ్రీ
Also Read
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
టీమిండియాకు వన్డేల్లో సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు.. 1986లో శ్రీలంకతో మ్యాచ్లో 78, 1993లో వెస్టిండీస్తో 100, 2017లో శ్రీలంకతో 112 అత్యల్ప స్కోర్లను భారత్ నమోదు చేసింది. ఇప్పుడు నాలుగోసారి 117 స్కోరుకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ని ఆస్ట్రేలియా జట్టు 39 ఓవర్లు (234 బంతులు) మిగిలి ఉండగానే ముగించింది. దీంతో.. బంతుల పరంగా భారత్కి ఇది అతిపెద్ద ఓటమిగా నిలిచింది. స్వదేశంలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇది రెండోసారి. 2020లోనూ ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఓవరాల్గా చూసుకుంటే.. ఆరోసారి ఈ మేరకు ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. 1981లో న్యూజిలాండ్, 1997లో వెస్టిండీస్, 2000, 2005లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిని మూటగట్టుకున్న భారత్.. 2020లో, ఇప్పుడు మళ్లీ ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది. ఇక స్వేదశంలో పేసర్లకే భారత్ 10 వికెట్లు కోల్పోవడం ఇది రెండోసారి. 2009లో గువాహటిలో జరిగిన మ్యాచ్లో ఆసీస్ పేస్ బౌలర్లు ఈ ఘనత సాధించారు.
Tollywood: వీళ్లలో ఒకడుంటేనే రచ్చ ఉంటది… ఇద్దరూ ఒక దగ్గరే ఉంటే అంతే ఇక…
తాజావార్తలు
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!