Womens IPL: నేడే విమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రకటన..రేసు నుంచి సీఎస్కే ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15 ఏళ్లుగా క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది డబుల్ కిక్కిచ్చేందుకు రెఢీ అయింది. ఇప్పటికే పురుషుల లీగ్ ఫ్యాన్స్కు మజా ఇస్తుండగా ఈ ఏడాది మహిళల లీగ్ కూడా ప్రారంభంకానుంది. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళా క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశమనే చెప్పవచ్చు. అయితే, బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్న విమెన్స్ ఐపీఎల్లో నేడు (జనవరి 25) కీలక ప్రక్రియ జరగబోతోంది. ఈరోజే విమెన్స్ ఐపీఎల్ టీమ్స్లను ప్రకటించనుంది. ఇప్పటికే కోట్లాది రూపాయలను ఆర్జిస్తూ ప్రపంచ క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీసీసీఐ మరింత సంపన్నం కానుంది. ఇదివరకే టెండర్లను ఆన్లైన్లో ఉంచగా పలు సంస్థలు, వ్యక్తుల నుంచి బిడ్లను స్వీకరించిన బీసీసీఐ..నేడు ఈ లీగ్లో పాల్గొనబోయే ఐదు టీమ్స్ను ప్రకటించనుంది.
Pathan Review: పఠాన్ మూవీ రివ్యూ (హిందీ)
Also Read
- Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
టెండర్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 21తో ముగిసింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఐదు టీమ్స్ కోసం 33 బిడ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో పురుషుల ఐపీఎల్కు చెందిన పది ఫ్రాంచైజీలు టెండర్లను కొనుగోలు చేశాయి. అయితే మొత్తంగా ఇప్పటిదాకా టెక్నికల్ బిడ్స్ను దాఖలు చేసినవి మాత్రం 17 మాత్రమే. ఆన్లైన్లో టెండర్లను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ టెక్నికల్ బిడ్స్ దాఖలు చేయలేదని సమాచారం. ఈ మూడు తప్ప మిగిలిన ఏడు ఫ్రాంచైజీలు పోటీలో ఉన్నాయి. మొత్తంగా 17 సంస్థలు టెక్నికల్ బిడ్స్ను సమర్పించగా.. వాటిలో 14 బిడ్స్కు బీసీసీఐ ఆమోదం కూడా తెలిపిందట. బోర్డు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఐదు టీమ్లను కొనుగోలు చేసేందుకు ఏడు ఐపీఎల్ టీమ్స్తోపాటు హల్దీరామ్స్, శ్రీరామ్ గ్రూప్, అదానీ గ్రూప్, కొటక్, ఏపీఎల్ అపోలో, స్లింగ్ షాట్ రూట్ మొబైల్లు కూడా పోటీలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఐదు టీమ్స్కు గానూ ఒక్కో జట్టు సుమారు రూ.600 నుంచి రూ.800 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ఫైనాన్షియల్ బిడ్ల దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత బీసీసీఐ.. దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ వేలం ద్వారా బీసీసీఐ సుమారు రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు ఆర్జించే వీలుందని విశ్లేషకుల అంచనా.
తాజావార్తలు
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్లో
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!