Virat Kohli: సచిన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. తొలి వన్డేలో సాధిస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిని కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా సచిన్ సెంచరీల రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సొంతగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ సొంతగడ్డపై 164 వన్డేలలో 20 సెంచరీలు చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సచిన్ రికార్డుకు కేవలం ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. కోహ్లీ స్వదేశంలో 101 వన్డేల్లో 19 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే సచిన్ వరల్డ్ రికార్డును కోహ్లీ సమం చేస్తాడు.
Read Also: Nabha Natesh: అమ్మడు వెనకపడింది అందుకేనట!
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
శ్రీలంకతో వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ మరో రెండు శతకాలు బాదితే 50 ఓవర్ల ఫార్మాట్లో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్ను దాటిపోతాడు. అటు శ్రీలంకపై 84 మ్యాచ్లు ఆడిన సచిన్ 8 సెంచరీలు చేశాడు. అయితే విరాట్ కోహ్లి 60 మ్యాచ్లలోనే ఆ టీమ్పై 8 సెంచరీలు చేయడం విశేషం. శ్రీలంకపై విరాట్ కోహ్లీ 2220 పరుగులు చేయగా సచిన్ 3113 పరుగులతో టాప్లో ఉన్నాడు. మరోవైపు వన్డేల్లో ఆల్టైమ్ అత్యధిక పరుగులు చేసిన టాప్-5లో చేరే అవకాశం కూడా విరాట్ కోహ్లీకి ఉంది. ఇందుకోసం విరాట్ ఇంకా 180 పరుగులు చేయాల్సి ఉంది. ఈ జాబితాలో సచిన్ 18,426 పరుగులతో టాప్లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430), మహేల జయవర్దనె (12,650) ఉన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!