IPL: ఎట్టకేలకు ఐపీఎల్ 2023 సీజన్ ముగిసింది. హోరాహోరీ పోరులో గుజరాత్ సూపర్ జేయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఏకంగా తన జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిపించి పెట్టాడు తలా ధోనీ. ఈ సీజన్ ఐతే ఇలా ముగిసింది. వచ్చే సీజన్ లో మహేంద్రుడు మళ్లీ బరిలోకి దిగుతాడా అన్నది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది. ఇదే సీజన్ ధోనీకి చివరిదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ గెలుపు తన ఫ్యాన్స్ కు ఒక గిఫ్ట్ అని ధోనీ అన్నాడు. అద్భుతమైన విజయం సాధించిన ఈ క్షణం తన రిటైర్మెంట్ ప్రకటనకు సరైన సమయమని… ‘థాంక్యూ వెరీ మచ్’ అంటూ తన రిటైర్మెంట్ ను సింపుల్ గా ప్రకటించగలనని అన్నాడు.
అయితే, మరో తొమ్మిది నెలలు పాటు హార్డ్ వర్క్ చేస్తానని, మరో ఐపీఎల్ సీజన్ ఆడుతానని స్పష్టం చేశాడు. అయితే, తన శరీరం ఎంత మేరకు సహకరిస్తుందనేని కూడా చూడాలని అన్నాడు. తుది నిర్ణయం తీసుకోవడానికి మరో 6 నుంచి 7 నెలల సమయం పడుతుందని ధోనీ చెప్పాడు. మరో ఐపీఎల్ ఆడటమనేది కష్టమైన పనే అయినప్పటికీ… తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ కోసం మరో ఐపీఎల్ ఆడాలనుకుంటున్నానని తలా ధోనీ తెలిపాడు. ఐపీఎల్ లో తాము సాధించిన ప్రతి ట్రోఫీ ప్రత్యేకమైనదే అని చెప్పాడు. ధోనీ చేసిన ప్రకటనతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సీజన్ ఐపీఎల్ ధోనీకి చివరిదనే భావనతో సీఎస్కే జట్టు ఆడిన ప్రతి స్టేడియంకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అన్ని స్టాండ్స్ ధోనీకి మద్దతుగా పసుపురంగుతో నిండిపోయాయి. చూడాలి మరీ ధోనీ మళ్లీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తాడా.. లేదా ఈ సీజన్ తో గుడ్ బై చెప్తాడా అన్నది.. మరికొన్ని రోజులు వేచి చూడాలి.
Anjan kumar: రేపు విచారణకు రావాలి.. అంజన్ కుమార్ యాదవ్ కు ఈడీ నోటీసులు