IPL: ఐపీఎల్లో కీలక పోరు.. ఫైనల్కు చేరేది ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్-15 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్… తొలి క్వాలిఫయర్ ఆడనున్నాయి. ఇవాళ సాయంత్రం జరగబోయే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్లో… ఎవరు విజయం సాధించి… ఫైనల్కు చేరుకుంటారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. రెండు జట్లు… లీగ్లో అద్భుతంగా ఆడాయి. హర్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు లీగ్ ప్రారంభం నుంచి అద్భుత విజయాలతో నంబర్వన్ స్థానంలోకి దూసుకెళ్లింది. 14 లీగ్ మ్యాచ్ల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
Read Also: Rajya Sabha Elections: ఇవాళే నోటిఫికేషన్.. రేపు నామినేషన్లు..
Also Read
- IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
ఇక, గుజరాత్ లీగ్ దశలో సాధించిన 10 విజయాల్లో ఏడుసార్లు ఛేజింగ్లో గెలిచింది. జట్టు సమష్టిగా రాణించడమే అందుకు కారణం. టాప్ఆర్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చెలరేగడం గుజరాత్కు కలిసొచ్చింది. హార్దిక్ పాండ్య, శుభ్మన్ గిల్… టాపార్టర్లో బ్యాటింగ్లో ఊపుమీద ఉన్నారు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ హిట్టర్లు.. స్ట్రోక్ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది. షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్తో బౌలింగ్లోనూ పటిష్ఠంగా ఉంది.
మరోవైపు రాజస్థాన్ ప్లేఆఫ్స్లో మెరుగైన చోటు కోసం తమ చివరి లీగ్ మ్యాచ్వరకూ పోరాడింది. సంజూ టీమ్.. లఖ్నవూ లాగే తొమ్మిది విజయాలతో నిలవగా.. మెరుగైన నెట్రన్రేట్ కారణంగా రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్లో ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు చేసి… టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ సంజూ శాంసన్, సిమ్రన్ హెట్మెయర్, యశస్వి జైశ్వాల్, పడిక్కల్, రియాన్ పరాగ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. రాజస్థాన్ బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సీజన్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా గుర్తింపు పొందాడు.
అయితే, గుజరాత్, రాజస్థాన్ మధ్య లీగ్ దశలో జరిగిన ఒక్క మ్యాచ్లో… గుజరాత్ విజయం సాధించింది. క్వాలియర్ ఫయర్ మ్యాచ్ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో… మ్యాచ్పై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరనుంది… ఓడిన జట్టు… ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో రెండో క్వాలిఫయర్లో తలపడాల్సి ఉంటుంది.. మరి ఇవాళే ఫైనల్కు చేరేది ఎవరు అనే ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్లో బిగ్ అప్గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!