IPL: ఐపీఎల్లో కీలక పోరు.. ఫైనల్కు చేరేది ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్-15 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్… తొలి క్వాలిఫయర్ ఆడనున్నాయి. ఇవాళ సాయంత్రం జరగబోయే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్లో… ఎవరు విజయం సాధించి… ఫైనల్కు చేరుకుంటారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. రెండు జట్లు… లీగ్లో అద్భుతంగా ఆడాయి. హర్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు లీగ్ ప్రారంభం నుంచి అద్భుత విజయాలతో నంబర్వన్ స్థానంలోకి దూసుకెళ్లింది. 14 లీగ్ మ్యాచ్ల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
Read Also: Rajya Sabha Elections: ఇవాళే నోటిఫికేషన్.. రేపు నామినేషన్లు..
Also Read
- Rohit Sharma: హిట్మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
ఇక, గుజరాత్ లీగ్ దశలో సాధించిన 10 విజయాల్లో ఏడుసార్లు ఛేజింగ్లో గెలిచింది. జట్టు సమష్టిగా రాణించడమే అందుకు కారణం. టాప్ఆర్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చెలరేగడం గుజరాత్కు కలిసొచ్చింది. హార్దిక్ పాండ్య, శుభ్మన్ గిల్… టాపార్టర్లో బ్యాటింగ్లో ఊపుమీద ఉన్నారు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ హిట్టర్లు.. స్ట్రోక్ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది. షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్తో బౌలింగ్లోనూ పటిష్ఠంగా ఉంది.
మరోవైపు రాజస్థాన్ ప్లేఆఫ్స్లో మెరుగైన చోటు కోసం తమ చివరి లీగ్ మ్యాచ్వరకూ పోరాడింది. సంజూ టీమ్.. లఖ్నవూ లాగే తొమ్మిది విజయాలతో నిలవగా.. మెరుగైన నెట్రన్రేట్ కారణంగా రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్లో ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు చేసి… టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ సంజూ శాంసన్, సిమ్రన్ హెట్మెయర్, యశస్వి జైశ్వాల్, పడిక్కల్, రియాన్ పరాగ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. రాజస్థాన్ బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సీజన్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా గుర్తింపు పొందాడు.
అయితే, గుజరాత్, రాజస్థాన్ మధ్య లీగ్ దశలో జరిగిన ఒక్క మ్యాచ్లో… గుజరాత్ విజయం సాధించింది. క్వాలియర్ ఫయర్ మ్యాచ్ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో… మ్యాచ్పై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరనుంది… ఓడిన జట్టు… ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో రెండో క్వాలిఫయర్లో తలపడాల్సి ఉంటుంది.. మరి ఇవాళే ఫైనల్కు చేరేది ఎవరు అనే ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!