Virat Kohli: సంచలన నిర్ణయం.. టీ20 క్రికెట్కు గుడ్బై?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli To Retire From T20 Format After T20 World Cup: కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడే.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కూడా ప్రకటించొచ్చన్న ప్రచారం జోరుగా సాగింది. అదే సమయంలో పామ్లేమితోనూ ఇబ్బంది పడుతుండడంతో, ఇక కోహ్లీ ప్రస్థానం ముగిసినట్టేనని వార్తలు వచ్చాయి. కానీ, వాటికి చెక్ పెడుతూ కోహ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. తన పని ఇంకా అయిపోయిలేదని సత్తా చాటాడు. ఇలాంటి తరుణంలో.. టీ20 ఫార్మాట్కు విరాట్ కోహ్లీ గుడ్బై చెప్పనున్నాడా? అనే అనుమానాలు తెరమీదకి వచ్చాయి. వన్డే, టెస్టు క్రికెట్పై మరింత దృష్టి సారించేందుకు.. అతడు టీ20 క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడనే రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్ తర్వాత.. కోహ్లీ ఈ పొట్టి క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ మాట్లాడుతూ.. కోహ్లీకి ఇదే ఆఖరి టీ20 వరల్డ్కప్ కాదని అన్నాడు. టీమిండియాకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న కోహ్లీ.. వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్లోనూ ఆడతాడని భావిస్తున్నానన్నాడు. కోహ్లీ ఫామ్, ఫిట్నెస్, పరుగుల దాహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని.. జట్టును గెలిపించాలనే పట్టుదల అతనిలో మెండుగా ఉందని.. కాబట్టి అతనికి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కాదని తాను కచ్ఛితంగా చెప్పగలనని నమ్మకంగా చెప్పుకొచ్చాడు. గడ్డు పరిస్థితులను కూడా కోహ్లీ ధీటుగా ఎదుర్కొన్నాడని.. ఇప్పుడు మరింత ఉత్సాహంగా దూసుకుపోతున్నాడని పేర్కొన్నాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కోహ్లి కీలక పాత్ర పోషిస్తానడంలో సందేహం లేదని ఆయన తెలిపాడు. మరి.. కోహ్లీ ఇంకా కొన్నాళ్లు టీ20 క్రికెట్ ఆడుతాడా? లేక రూమర్లు వస్తున్నట్టుగా ఈ ఏడాది వరల్డ్కప్ తర్వాత గుడ్బై చెప్పేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Also Read
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
ఇదిలావుండగా.. ఆసియా కప్ టోర్నీలో 71వ శతకం చేసిన కోహ్లీ, ఈ టీ20 వరల్డ్కప్ టోర్నీలోనూ విజృంభించాలని అభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా.. పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో కోహ్లీ విశ్వరూపం చూపాలని ఆకాంక్షిస్తున్నారు. పాకిస్తాన్పై కోహ్లీ చాలాసార్లు ప్రతాపం చూపిన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి.. అక్టోబర్ 23న పాక్తో జరిగే మ్యాచ్లో చెలరేగి ఆడుతాడని అనుకుంటున్నారు. మరి, కోహ్లీ అభిమానుల కోరికని తీరుస్తాడా? లేదా? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..