Mumbai Indians Junior: ఆకాశమే హద్దుగా చెలరేగిన చిచ్చరపిడుగు.. 178 బంతుల్లో 508 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
U14 boy Yash Chowde becomes first Nagpur cricketer to score 500 runs In U14: క్రికెట్ చరిత్రలో ఒక చిచ్చరపిడుగు సరికొత్త సంచలనానికి నాంది పలికాడు. ఎవ్వరికీ సాధ్యం కాని రేంజ్లో పరుగుల వర్షం కురిపించి, తన పేరిట చారిత్రాత్మక రికార్డ్ లిఖించుకున్నాడు. కేవలం 178 బంతుల్లోనే 508 పరుగులు సాధించాడు. చివరివరకు నాటౌట్గా నిలిచాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. అతని పేరు యశ్ చౌదే. వయసు కేవలం 13 సంవత్సరాలే.
Kishan Reddy: తండ్రిని అడ్డుపెట్టుకుని కేటీఆర్లా మంత్రిని కాలేదు.. కష్టపడి పైకి వచ్చాం..
Also Read
- FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
- Virat Kohli: "ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు".. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
- Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!
- India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ - భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్కు వర్షం ముప్పు..
ముంబయి ఇండియన్స్ లేటెస్ట్గా అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నాగపూర్లో సరస్వతి విద్యాలయ, సిద్ధేశ్వర్ విద్యాలయ జట్ల మధ్య 40 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత సరస్వతి సరస్వతి విద్యాలయ బ్యాటింగ్ చేసింది. ఈ జట్టు తరఫున ఓపెనర్గా యశ్ చౌదే దిగాడు. ఇతడు క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. దీంతో 178 బంతుల్లోనే 508 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అందులో 81 ఫోర్లు, 18 సిక్సులు ఉన్నాయంటే.. అతడు ఏ రేంజ్లో విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అంతర్ పాఠశాలల రికార్డులో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
Cow Dung : పేడండి.. పేడ.. స్వచ్ఛమైన ఆవు పేడ..
యశ్ చౌదే ఆడిన భారీ ఇన్నింగ్స్ పుణ్యమా అని.. సరస్వతి విద్యాలయ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 714 పరుగులు చేసింది. అతనితో పాటు మైదానంలో దిగిన మరో ఓపెనర్ తిలక్ వకోడే 97 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ఇక 715 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిద్ధేశ్వర్ విద్యాలయ జట్టు.. అత్యంత దారుణంగా ప్రదర్శించింది. కనీస పోరాటపటిమ కనబర్చకుండా ఘోరంగా విఫలమైంది. కేవలం 5 ఓవర్లలో 9 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కాగా.. ఈ ఇన్నింగ్స్తో యశ్ చౌదే అంతర్జాతీయ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకకు చెందిన చరిత్ సెల్లెపెరుమ (553) తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో 500కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అవతరించాడు.
Guava Benefits : రోజుకో పండు తినండి.. రోగాలకు దూరంగా ఉండండి
అన్ని ఫార్మాట్లలో చూస్తే.. ఇప్పటివరకు 10 మంది ఆటగాళ్లు మాత్రమే 500కి పైచిలుకు పరుగులు సాధించారు. వారిలో ఐదుగురు భారత్ ఆటగాళ్లే ఉన్నారు. ప్రణవ్ ధనవాడే (1009 నాటౌట్), ప్రియాన్షు మోలియా (556 నాటౌట్), పృథ్వీ షా (546), దాదీ హవేవాలా (515) ఇప్పటిదాకా ఈ జాబితాలో ఉండగా.. లేటెస్ట్గా యశ్ చౌదే (508 నాటౌట్) చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి వారి సరసన చేరాడు.
తాజావార్తలు
-
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!