IndvsWi: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్తో మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్కు ముందు జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇక, టీమిండియా వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్కే తుది జట్టులో చోటు దక్కంది. దీంతో సంజూ శాంసన్ బెంచ్కే పరిమితమ్యాడు. స్పిన్ కోటాలోనూ కుల్దీప్ను టీమ్ లోకి తీసుకోగా.. చాహల్ డగౌట్ కి పరిమితమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న శార్దూల్ ఠాకూర్కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది.
Read Also: Kushi: సామ్ ను రౌడీ హీరో ఎక్కడా వదలడం లేదుగా
Also Read
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
- Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్కు పండగే..
- ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్పై నిషేధం.. ఎందుకంటే..?
అయితే, టెస్టు సిరీస్ని 1-0తో కైవసం చేసుకున్న భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్గా ఈ వన్డే సిరీస్ని చూస్తోంది. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్లో అదరగొట్టారు. అయితే శుభ్ మన్ గిల్ ఈ టెస్టు సిరీస్లో పెద్దగా రాణింకలేకపోయాడు. ఈ ఏడాది వన్డేల్లో దుమ్మురేపిన గిల్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 7లో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్ పర్ఫామెన్స్ కూడా బాగుంటే, అతను టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఇషాన్ కిషన్.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడడం దాదాపు ఖాయమే అయినట్లు కనిపిస్తుంది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకునేందుకు సంజూ శాంసన్కి ఈ వన్డే సిరీస్ అత్యంత కీలకం. గత ఏడాది వన్డేల్లో ఆడినంత వరకూ సంజూ శాంసన్ బాగానే ఆడాడు.. అయితే తొలి వన్డేలో మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్కి తుది జట్టులో అవకాశం ఇచ్చింది.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. అంబటి ధ్వజం
మహ్మద్ సిరాజ్ గాయంతో స్వదేశానికి తిరిగి వచ్చేయడంతో వన్డే సిరీస్లో ఉమ్రాన్ మాలిక్, జయ్దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు. రెండో టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్, నేటి మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.. అయితే, ఇవాళ్టి మ్యాచ్లో వెస్టిండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్, వన్డే టీమ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?